Ultimate magazine theme for WordPress.

భారత క్రికెటర్ సిరాజ్ ను సన్మానించిన రేవంత్ రెడ్డి

Post top
home side top

అంతర్జాతీయ క్రికెట్‌లో భారత దేశానికి, మన తెలంగాణ రాష్ట్రానికి గొప్ప పేరు ప్రఖ్యాతులు తెచ్చిన అల్ రౌండ్ క్రికెటర్ మహమ్మద్ సిరాజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. #T20WorldCup ‌ను గెలుచుకున్న అనంతరం హైదరాబాద్‌కు వచ్చిన్న సిరాజ్ ముఖ్యమంత్రిని ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా సిరాజ్‌ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు ఉన్నారు

 

#T20WorldCup2024 లో సిరాజ్‌ అద్భుతమైన ప్రతిభను కనబరిచారని ముఖ్యమంత్రి ప్రశంసించారు. సిరాజ్ కు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉద్యోగంతో పాటు ఇంటి స్థలం కేటాయించాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్‌లో లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో అందుకు అనువైన స్థలాన్ని గుర్తించడంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం కల్పించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.