మాదకద్రవ్యాలు సమాజానికి చేటు అనే అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అన్న భీమోజు గాయత్రి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి చేతుల మీదుగా మెమొంటో స్వీకరిస్తున్న దృశ్యం
మిర్యాలగూడ ప్రజాలహరి…అంతర్జాతీయ మాదకద్రవ్యాల నిర్మూలన దినోత్సవం సందర్భంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ డివిజనల్ పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీల లో స్థానిక లోటస్ పాఠశాలకు చెందిన అన్నభీమోజు గాయత్రి ప్రథమ బహుమతిని గెలుచుకుంది. చిన్నారి గాయత్రిని మిర్యాలగూడ ఎమ్మెల్యేబత్తుల లక్ష్మారెడ్డి అభినందించి మెమొంటో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ యువత మత్తుకు బానిస కాకుండా మాదకద్రవ్యాలను నిరోధించడంలో పోలీసు వారికి సహకారం అందించి మాదకద్రవ్యాలు లేని పట్టణంగా మిర్యాలగూడను చేయటానికి కృషి చేయాలన్నారు