*నాణ్యమైన విద్యను మీరు అందించండి .. మౌలిక వసతులను నేను కలిపిస్తాను…. మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి
మిర్యాలగూడ ప్రజా లహరి.,. మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు SP కన్వెన్షన్ నందు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన *ప్రొ,, జయశంకర్ సార్ బడి బాట* కార్యక్రమంలో భాగంగా *ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం* కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొన్న మిర్యాలగూడ నియోజకవర్గ ప్రభుత్వ ఉపాధ్యాయులు .. ముఖ్య అతిథిగా పాల్గొన్న శాసనమండలి సభ్యులు అల్గుబెల్లి నర్సిరెడ్డి , మాజీ MLC పూల రవీందర్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నేను నా ఈ పదవి కాలం అంతా ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ హాస్పిటల్స్ అభివృద్ది పైనే ప్రత్యేకమైన దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నాను అని అన్నారు.. ఈరోజు నిర్వహించిన ఈ ఉపాధ్యాయుల ఆత్మీయ సమ్మేళనం యొక్క ముఖ్య ఉద్దేశం రానున్న రోజుల్లో మిర్యాలగూడ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటు కార్పొరేట్ స్కూల్స్ కి పోటీగా ఉండాలి.. దానికి మీ ఉపాధ్యాయుల సహకారం చాలా అవసరం.. ప్రభుత్వ ఉపాధ్యాయులు అంటే ప్రైవేటు ఉపాధ్యాయుల కంటే కూడా ఎక్కువ విద్యా అర్హతలు, నైపుణ్య కలిగి ఉంటారు.. కావున మీరు విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెడితే నాణ్యమైన విద్యని అందించగలము అని అన్నారు.. ప్రభుత్వ పాఠశాలలో కావాల్సిన మౌలిక వసతులను మీకు అందించే బాధ్యత నాకు ఇవ్వండి అని అన్నారు.. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి లో 10/10 మార్కులు సాధించిన విద్యార్థులను సత్కరించారు ..
ఈ కార్యక్రమంలో ఎంఈఓ బాలాజీ నాయక్, పి ఆర్ టి యు రాష్ట్ర అధ్యక్షుడు సీతారామరెడ్డి యుటిఎఫ్ నాయకులు ప్రభాకర్ నియోజకవర్గ ప్రభుత్వ పాఠశాలల, ప్రధానోపాధ్యాయులు , ఉపాధ్యాయులు ఇతర ఉపాధ్యాయ సంఘాల సభ్యులు పాల్గొన్నారు..