తెలంగాణలో కాంగ్రెస్ ఎనిమిది బిజెపి ఎనిమిది, ఎంఐఎం ఒకటి.
ప్రజాలహరి హైదరాబాద్…. పార్లమెంటు ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్- బిజెపి సమ బలాలు చూపించుకున్నాయి .కాంగ్రెస్ పార్టీ ఎనిమిది పార్లమెంట్ సీట్లు గెలుపొందగా, బిజెపి 8 పార్లమెంట్ సీట్లను గెలుపొందింది. ఎంఐఎం యధాతరంగా హైదరాబాదులో తన సీట్ ని పదిలపరుచుకోంది .వీటిని బట్టి చూస్తే ఉత్తర తెలంగాణ భాజపా, దక్షిణ తెలంగాణ మొత్తం కాంగ్రెస్ పార్టీలో సీట్లు గెలుపొందాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన నల్గొండ పార్లమెంటు నుంచి కుందురు రఘువీర్ రెడ్డి, భువనగిరి పార్లమెంటు నుంచి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్, వరంగల్ నుంచి కడియం కావ్య ,నాగర్ కర్నూల్ మల్లు రవి, జహీరాబాద్ నుంచి సురేష్ షట్కర్, ఖమ్మం వెంకటరామ్ రెడ్డి, పెద్దపల్లి వంశీకృష్ణ, బిజెపి నుంచి కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ ధర్మపురి అరవింద్ ,మల్కాజ్గిరి ఈటల రాజేందర్, ఆదిలాబాద్ గొడెం నగేష్, మెదక్ రఘునందన్ రావు, మహబూబ్నగర్ డీకే అరుణ, సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, చేవెళ్ల కొండా విశ్వేశ్వర రెడ్డి, ఎమ్ఐఎమ్ నుంచిహైదరాబాద్ అసదుద్దీన్ ఓవైసీ గెలుపొందారు