తెలంగాణ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్న కేసీఆర్..
హైదరాబాద్ .. ప్రజాలహరి…. తెలంగాణ రాష్ట్ర అవతరణ శతాబ్ది ఉత్సవాలు తెలంగాణ భవన్లో ఘనంగా జరిగాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు వేడుకల్లో పాల్గొన్నారు ముందుగా అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ తెలంగాణ ఎన్నో ఏళ్ల ఆకాంక్షను పోరాడి సాధించుకున్నదని పేర్కొన్నారు
తెలంగాణలో తెలంగాణ అని మాట్లాడకూడదని అసెంబ్లీ స్పీకర్ నుంచి ఉత్తర్వులు వచ్చాయని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ యాసను అవమానించారని బతుకమ్మ పండుగ అంటే అందరూ అవమాన పడే వాళ్ళని అటువంటి పరిస్థితులనుంచి ఈరోజు బతుకమ్మ పండుగ చేసుకునే స్థాయికి తీసుకొచ్చినది కేసీఆర్ అన్నారు. అందరూ తమ గొప్ప అనుకుంటున్నారు .ఆరోజు ఉద్యమం వెంట ఎవరూ లేరని తాత్కాలికంగా పాల్గొనడం వెళ్ళిపోవడమే గాని నిరంతరం కూడా సాగించలేదని ఈ సందర్భంగా చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం ఆ విషయాన్ని ఇప్పుడున్న పాలకులు తమను విమర్శించే వాళ్ళు మరిచిపోతున్నారని చెప్పారు. కొన్ని పార్టీలు అయితే మేము తెలంగాణకు అనుకూలం కాదని బహిరంగంగా శ్రీకృష్ణ కమిషన్కు నోట్ ఇచ్చారని వాళ్లు సంగతి వాళ్ళు చూసుకుంటే మంచిదని సందర్భంగా పేర్కొన్నారు . సోనియాగాంధీ తెలంగాణ ఇస్తున్నట్లు ప్రకటించి ఆ ప్రకటనను వెనక్కు తీసుకున్న ఈ విషయాన్ని ఎవరు మరవకూడదని వివరించారు. ఆనాడు ఉద్యమానికి నాయకత్వం వహించి అన్ని పార్టీలన్నీ వర్గాలను కవులు ,మేధావులు, ఉద్యమకారులు, ప్రజాసంఘాలు ఉద్యోగుల, వ్యాపార ,కార్మిక కర్షక ,విద్యార్థి, మహిళా సంఘాలను కలుపుకొని ఉద్యమం చేసి ఉద్యమాన్ని తారాస్థాయి తీసుకెళ్లిన విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలన్నారు. జంగ్ సైరన్ విషయాన్ని ఎవరు మరవకూడదన్నారు రాజకీయాల్లో గెలుపోవటమును సర్వసాధారణం అంతమాత్రాన ఆ విషయాన్ని మర్చిపో మర్చిపోయి అంతా తమ వాళ్ళని గొప్పలు చెప్పుకుంటున్నారని ఇది బాధాకరమైన విషయం అని కెసిఆర్ అన్నారు ప్రొఫెసర్ జయశంకర్ లాంటి మహా నేతలు ఉద్యమ పోరాటంలో రాజీలేంగా పోరాడార ని పేర్కొన్నారు. పోచారం లాంటి మహానాయకుడు పలుమార్లు జైలుకు వెళ్లారని విషయం గుర్తు చేశారు 1969 తెలంగాణ ఉద్యమం తారాస్థాయి చేరుతుందని ఆనాడు అనేకమంది అమరులు అయ్యారని ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకోవాలని ముఖ్యంగా గ్రామస్థాయిలో ప్రజలు మర్చిపోకూడదని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ పై ఆయన మాట్లాడుతూ మహబూబ్నగర్ ఎమ్మెల్సీ విజయ సాధించామని రేపు నల్గొండ ఖమ్మం వరంగల్ ఎమ్మెల్సీ కూడా చేసుకుంటామని పార్లమెంటు సీట్లలో కూడా మేము అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్తామని చెప్పారు.భారత రాష్ట్ర సమితికి ప్రజా ఆదరణ ఉన్నదని అది లేకుండా చేయడానికి తప్పుడు ఆరోపణలు అనైతికవేన వ్యక్తులను తెరమీదకి తీసుకొస్తూ తమ పోరాటాన్ని, ప్రజా ఉద్యమాన్ని లేకుండా చేయాలని కొందరు విషపూరిత కుట్రలు చేస్తున్నారని చెప్పారు.