ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
మిర్యాలగూడ పట్టణంలోని అవసరానికి మించి ఆటోలు పరిమితి లేని ఆటోలు తిరగడం వల్ల సాధారణ ప్రజానీకానికి మరియు ద్విచక్ర వాహనాలకు రహదారులు అష్టదిగ్బంధన స్థితిలో విలవిలా ఆడుతున్నాయి. అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆటోలలో పరిమితికి మించిన జనాల్ని ఎక్కించి ఎదురుగా వస్తున్న వాహనాలు అయితేనేమి, సాటి వాహనాల కు సైతం ఇబ్బందిని కలుగజేస్తున్న దుస్థితి దర్శనమిస్తుంది. ఈ సందర్భంగా పలువురు నాయకులు ప్రభుత్వ అధికారులను అప్రమత్తం చేయవలసిందిగా ప్రజలు వేడుకుంటున్నారు అదేవిధంగా మైనర్లు కూడా వాహనాలను నడపడం మనం ఇంకా చూస్తూనే ఉన్నాం. జులై 1 నుండి రూల్స్ మారినట్లు వస్తున్న ప్రచారంలో ఎటువంటి ప్రయోజనం లేదని కనీసం త్రిబుల్ రైడింగ్లను మైనర్ బాలుర వాహన చోదకులను పట్టుకున్న సందర్భాలు కనిపించడం లేదని ప్రజలువాపోతున్నారు.