Ultimate magazine theme for WordPress.

వేములపల్లి మండలం లోని పలు ప్రభుత్వ పాఠశాలను తనిఖీ చేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

Post top
home side top

*ప్రభుత్వ పాఠశాలలో అకస్మిక పర్యటన చేసిన – MLA

వేములపల్లి ప్రజలహరి

ఈరోజు వేములపల్లి మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలాలను, ప్రభుత్వ వసతి గృహాలలో అకస్మిక పర్యటన చేసిన మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి . ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల వసతులను, మధ్యాహ్న భోజన సదుపాయాలు , టీచర్స్ రిజిస్టర్ పరిశీలించి నిర్లక్ష్యం ఉంటే వెంటనే వారిని తొలగిస్తామని సూచనలు చేశారు… అలాగే ప్రభుత్వ వసతి గృహాలలో విద్యార్థులతో మాట్లాడి అక్కడి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు … సదుపాయాలు సరిగాలేని చోట సంబంధిత అధికారులతో మాట్లాడి వారిపై చర్యలు తీసుకోవాలని తెలియజేశారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో విద్యార్థులకు సరైన సదుపాయాలు కల్పిస్తూ వారికి నాణ్యమైన విద్యను అందిస్తే వారు ప్రభుత్వ పాఠశాలల పై మొగ్గు చూపుతారని అన్నారు…. అధికారులకు , ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు… మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ప్రతీ ప్రభుత్వ పాఠశాలకు మేము అకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని అన్నారు.. ఈ కార్యక్రమంలో MEO , కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.