జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మాగంటి సునీతకు బి ఫాం అందజేస్తున్న కేసీఆర్ ..ప్రక్కన మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు
ప్రజాలహరి హైదరాబాద్
జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాగంటి సునీత గోపీనాథ్ కు పార్టీ అధినేత కేసీఆర్ బి-ఫామ్ అందజేశారు. ఎన్నికల ఖర్చు నిమిత్తం పార్టీ తరఫున 40 లక్షల రూపాయలు చెక్కును అందించారు.
ఈ కార్యక్రమంలో దివంగత నేత, మాగంటి గోపీనాథ్ కూతుళ్లు, కుమారుడు, మాజీ మంత్రి – మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, మాజీ మంత్రి- సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నలమోతు భాస్కర్ రావు, అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, తదితరులు పాల్గొన్నారు
