విష ఆహారము తిని సుమారు 150 గొర్రెలు మృతి వేములపల్లి( ప్రజాలహరి ) పశువుల కాపర్ ల గోస వినేటట్టు లేదు, చెప్పేటట్టు లేదు, పూర్తి వివరాల్లోకెళ్తే బ్రతుకుతెరువు కోసం గొర్రెల కాపరులు సూర్యాపేట జిల్లా పెనుబాడ మండలం దోసపాడు గ్రామం నుంచి గొర్రెలను మేపుకుంటూ జీవనం సాగిస్తారు అందులో భాగంగానే నల్గొండ జిల్లాలోని వేములపల్లి మండల కేంద్రంలో ని ఉన్నటువంటి ఎన్ఎస్పి కాలువ నుంచి అన్నపురెడ్డి గూడెం శివారు వరకు మేపుకుంటూ మేపుకుంటూ వెళ్తుండగా. అట్టి మేపులు భాగంగా వరాలకు ఉన్నటువంటి గడ్డిని తింటే గొర్రెలు సుమారుగా 100 నుంచి 150 గొర్రెల వరకు గురువారం మృతి చెందినట్లు డాక్టర్ అశోక్ ధ్రువీకరించారు. ఇట్టి విషయంపై డాక్టర్ను వివరణ అడగగా గతంలో పొలాలకు సంబంధించినటువంటి వరాలకు కొట్టినటువంటి గడ్డి మందు వల్లనే గొర్రెలు మృతి చెందినట్లుగా ఆయన తెలిపారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
