ట్రాక్టర్ ను ఢీ కొట్టిన ట్రావెల్స్ బస్సు…
-నలుగురికి తీవ్ర గాయాలు
వేములపల్లి ప్రజాలహరి
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం వద్ద అద్దంకి-నార్కెట్పల్లి హైవేపై మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది.ఈ రోడ్డు ప్రమాదంలో ట్రాక్టర్ ను వెనుక నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు డి కొట్టింది. ప్రమాదంలో రోడ్డుపై ట్రాక్టర్ బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ట్రాక్టర్ పై ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి.క్షతగాత్రులను మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.బస్సు ఏపీలోని కావలి నుంచి హైదరాబాదుకు వెళ్తుండగా ఈ ఈ ఘటన జరిగినట్లు తెలిస్తుంది.ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులు ఉండగా పెను ప్రమాదం తప్పినట్లు అయింది.
