ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
ద్విచక్ర వాహనం ఢీ వ్యక్తి మృతి
కిష్టాపురం గ్రామానికి చెందిన సత్యనారాయణ రెడ్డి (75) ఇంటి నుండి బయలుదేరి పెరుగు కోసం కిరణం షాపుకు రోడ్డు దాటి వెళ్తుండగా మిర్యాలగూడ నుండి దామరచర్ల వెళుతున్న హోండా షైన్ వెహికల్ AP24AF 38 59 నంబరు కలిగిన వాహనము అతివేగంగా ఢీకొనగా అక్కడికక్కడే పడిపోయిన నారాయణరెడ్డిని గ్రామంలోని చుట్టుపక్కల వారు చూసి 108 వాహనంలో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం అదే అంబులెన్స్ లో నల్గొండకు తరలించగా, తలకు వెనుక భాగంలో, చేతులకు మరియు కుడి కాలికి గాయమైన పరిస్థితులు చికిత్స పొందుతూ అదే రోజు రాత్రి మరణించాడు ఈ విషయమై నారాయణరెడ్డి మనవరాలు మందడి హరిత భర్త జాన్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు రూరల్ సబ్ ఇన్స్పెక్టర్ తెలియజేశారు
