కొలిక్కి వస్తున్న సాయిసంతోషి జ్యువెల్లర్స్ దొంగతనం కేసు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన బంగారం షాప్ దొంగతనం కేసులు మరో ఇద్దరు దొంగల అరెస్ట్..
మిర్యాలగూడ ప్రజాలహరి
కేసులో భాగంగా దొంగతనానికి పాల్పడ్డ ఐదుగురిలో పచ్చిమ బెంగాల్ కి చెందిన మాలిక్ మొల్ల అనే వ్యక్తితో పాటు, దుండగులకు ఖమ్మంలో ఆశ్రయం ఇచ్చిన నేపాల్ కి చెందిన భట్ట అమర్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసిన సూర్యాపేట పోలీసులు.
వారి వద్ద నుండి 554 గ్రాముల(55తులాలు) సుమారు 60 లక్షల విలువల బంగారు ఆభరణాలు, 92,500/- నగదు స్వాధీనం.
మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన సూర్యాపేట జిల్లా SP K. నరసింహ పాల్గొన్న DSP ప్రసన్న కుమార్, CI వెంకన్న, CCS CI శివకుమార్, SI లు హరికృష్ణ, శివతేజ లు ఉన్నారు.
