
మిర్యాలగూడ ప్రజాలహరి.
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల *లక్ష్మారెడ్డి- , సబ్ కలెక్టర్ *నారాయణ అమిత్ గ* కలిసి జిల్లా కలెక్టర్ *ఇలా త్రిపాఠి* పట్టణంలో విస్తృతంగా పర్యటించారు….
గతంలో చేపట్టిన,చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించారు.రామచంద్రగూడెం Y జంక్షన్,తడకమల్ల X రోడ్ వద్ద ప్రమాదకరంగా మారిన ఫౌంటెన్ లు పరిశీలించారు…
నూతనంగా మంజూరైన ఫ్లై ఓవర్లు నిర్మించాల్సిన ప్రదేశాలను పరిశీలించారు…
అనంతరం హనుమాన్ పేట ఫ్లైఓవర్ కింద చిరు వ్యాపారులకు నిర్మించ తలపెట్టిన సమీకృత మార్కెట్ నిర్మాణాన్ని పరిశీలించి మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు…
అదేవిధంగా కళాభారతి ఆడిటోరియంలో మున్సిపల్,రెవిన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు….
ఈ సందర్భంగా ఎమ్మెల్యే *బత్తుల లక్ష్మారెడ్డి- వీడియో ప్రజెంటేషన్ ద్వారా పట్టణంలో నెలకొన్న పలు సమస్యలను కలెక్టర్ కు వివరించారు…
దానితోపాటు అభివృద్ధి పనుల పేరిట గతంలో జరిగిన అవినీతిని కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లారు….
వీటిపై కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ అవినీతిపై పూర్తి విచారణ చేపడతామని, పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు….
ఇలా నియోజకవర్గ సమస్యలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సమస్యలను వివరించిన మొట్టమొదటి ఎమ్మెల్యే మీరే అంటూ కలెక్టర్ *బత్తుల లక్ష్మారెడ్డి- BLR గారి ని* అభినందించారు…
ప్రధానంగా డంపింగ్ యార్డ్ తో సమీపకాలనీ ప్రజలు తీవ ఇబ్బందులు తొలగించేందుకు పట్టణానికి సుదూర ప్రాంతంలో స్థల సేకరణ జరపాలంటూ ఆదేశించారు…
అధునాతన ట్రీట్మెంట్ ప్లాంట్ తో కూడిన డంపింగ్ యార్డ్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు…
ఎన్టీఆర్ మున్సిపల్ కాంప్లెక్స్,ఆర్టీసీ కాంప్లెక్స్,రోడ్డు వెడల్పు కు ఇబ్బందికరంగా మారిన న్యాయపరమైన చిక్కులను తొలగించేందుకు స్థానిక అధికారులు పూర్తి వివరాలతో ప్రతిపాదనను పంపినట్లయితే లీగల్ సెల్ ద్వారా సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తామన్నారు…పెరిగిన జనాభాకు అనుగుణంగా మున్సిపల్ సిబ్బందిని పెంచేందుకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని మున్సిపాలిటీ అధికారులను ఆదేశించారు…గతంలో నిర్మించిన ఫౌంటెన్లు కారణంగా జరిగిన ప్రమాదాల వివరాలు అందచేసినట్లయితే…
ఆ స్థానంలో పునర నిర్మాణం జరిపి ప్రమాద నివారణ చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు…
అనంతరం మిర్యాలగూడ సబ్ డివిజన్ పరిధిలో నూతనంగా నిర్మాణం జరుపుకుంటున్న ఎత్తిపోతల పథకాల పనుల పురోగతిపై సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు బత్తుల లక్ష్మారెడ్డికుందూరు జైవీర్ రెడ్డి , ఎమ్మెల్సీ శంకర్ నాయక్ కలసి కలెక్టర్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు…..