
జేఈఈ మెయిన్స్ ఫలితాలలో కెఎల్ఎన్ కాలేజీ విద్యార్థుల ర్యాంకుల ప్రభంజనం…… మిర్యాలగూడ ప్రజాలహరి. జాతీయస్థాయిలో నిర్వహించిన జేఈఈ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫలితాల్లో మిర్యాలగూడ పట్టణానికి కే ఎల్ఎన్ కళాశాల విద్యార్థులు ర్యాంకుల ప్రభంజనం సృష్టించారు. వివిధ కేటగిరి పరీక్ష ఉత్తీర్ణలలో కే. అభిరామ్ 3861 ర్యాంక్, పి రంగా 3967 ర్యాంకులు సాధించారు. అదేవిధంగా పదివేల ర్యాంకుల లోపు 15 మంది అర్హత సాధించారని సాధించారని కేఎల్ఎం కాలేజీ వ్యవస్థాపక డైరెక్టర్లు కిరణ్ కుమార్, కన్వంత్ రెడ్డి హనుమంత్ రెడ్డి, నరేందర్ రెడ్డి, హుస్సేన్, పి ఎల్ ఎన్ రెడ్డి లు తెలిపారు.