
మిర్యాలగూడ ప్రజాలహరి …..మిర్యాలగూడ మండలం అవంతిపురం మార్కెట్ యార్డు ను గురువారం సందర్శించిన మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మా రెడ్డి ,సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ .. మార్కెట్ యార్డు లోని IKP సెంటర్ మరియు మార్కెట్ పరిసరాలు సందర్శించి రైతులతో కలిసి మాట్లాడి ధాన్యం పరిశీలించారు … అనంతరం అధికారులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.. ఈ సందర్భంగా *MLA * మాట్లాడుతూ మార్కెట్ కి వచ్చిన రైతుల ధాన్యం కొనుగోలు విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రతిఒక్కరికి సహకరించాలని సూచించారు .. అలాగే మార్కెట్ లో నూతన గోదామ్ లు ఏర్పాటు పై చర్చించారు .. అలాగే శనివారం, మంగళవారం నిర్వహించే సంతకి వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు .. ఈ కార్యక్రమంలో ఈ కార్యక్రమంలో సెక్రెటరీ మధుబాబు తెలంగాణ వ్యవసాయ మార్కెటింగ్ ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చిలక నరసింహారెడ్డి నాయకులు పాల్గొన్నారు..