డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కు పూలదండలు వేసి నివాళుlu అర్పించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ శంకర్ నాయక్

మిర్యాలగూడ ప్రజాలహరి…
ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రి భారత రత్న *డా,, బి ఆర్ అంబేద్కర్ గారి 135 వ జయంతి* సందర్భంగా మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు వేడుకల్లో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు *బత్తుల లక్ష్మారెడ్డి -* మరియు MLC *శంకర్ నాయక్ మాడుగులపల్లి మండలం చిరుమర్తి గ్రామంలో వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.. అనంతరం మిర్యాలగూడ పట్టణంలోని పలు చోట్ల డా,, బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు..
అనంతరం దామరచర్ల మండల కేంద్రంలో వారి జయంతి వేడుకల్లో పాల్గొని నివాళులు అర్పించారు..
ఈ సందర్భంగా *MLA -* మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత *డా,, బి ఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావుల్లో ఒకరు.. కుల, మత రహిత ఆధునిక భారత దేశం కోసం అంబేద్కర్ తన జీవితకాలం పోరాటం చేశారు.
దళితుల పట్ల నాడు ఉన్న వివక్షను రూపుమాపేందుకు అంబేద్కర్ చేసిన పోరాటం మరువలేనిది.
అంటరానితనం గురించి ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది…
మన జీవన శైలిలో మార్పులు రావాలి మన భవిష్యత్తు మారాలి అంటే చదువు ఒక్కటే ఆయుధం అని బోధించిన మహనీయులు వారు…
అంబేద్కర్ కేవలం ఒక జాతిలో ఒక కులానికో, ఒక మతానికో చెందిన వారు కాదు.. మన భారత జాతి సంపద వారు మన దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి వారు ప్రతీ ఒక్కరు వారి ఆశయ సాధనకు కృషి చేయాలని అన్నారు..
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు..