
మిర్యాలగూడ ప్రజాలహరి…… మిర్యాలగూడ బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా సీనియర్ న్యాయవాది నేతి సత్యనారాయణ ఎన్నికయ్యారు.ఆయనతోపాటు ప్రధాన కార్యదర్శిగా భూపతి రెడ్డి ఎన్నిక అయ్యారు. ఈ సందర్భంగా సత్యనారాయణ గారు మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తానని కక్షిదారులు న్యాయవాదుల మధ్యన సమన్వయం ఉండే విధంగా చూస్తామన్నారు.కక్షి దారులకు సత్వర న్యాయవందేలా చూస్తామని అన్నారు.