తిరుమలగిరి పైలెట్ ప్రాజెక్టుపై సమావేశం లో పాల్గొన్న సాగర్ ఎమ్మెల్యే జై వీర్ రెడ్డి, సబ్ కలెక్టర్ అమిత్ నారాయణ

మిర్యాలగూడ ప్రజాలహరి*తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తిరుమలగిరి సాగర్ మండలం ను పైలట్ ప్రాజెక్టుగా* ఎంపిక చేయగా తిరుమలగిరి సాగర్ మండలం నందు గల గ్రామాలలో రెవెన్యూ మరియు సర్వే సిబ్బంది ఆయా గ్రామాల్లోని ప్రభుత్వ భూములను ఎంజాయ్ మెంట్ సర్వే చేయడం జరిగినది.అట్టి ఎంజాయ్ మెంట్ సర్వే చేసి గ్రామాల వారీగా అర్హులను గుర్తించడం జరిగినది.అట్టి అర్హులకు అసైన్ మెంట్ పట్టాలు జారీ చేయాలని సదుద్దేశంతో నేడు సబ్-కలెక్టర్, మిర్యాలగూడ అసైన్ మెంట్ కమిటీ సమావేశం నిర్వహించడం జరిగినది.
అట్టి కమిటీలో భాగంగా నేడు అసైన్ మెంట్ కమిటీ సభ్యులు నాగార్జున సాగర్ శానససభ్యులు కుందూరు జయవీర్ రెడ్డి కన్వీనర్ శ్ సబ్ కలెక్టర్, మిర్యాలగూడ, మరియు సభ్యులు ప్రాజెక్టు డైరెక్టర్, DRDA హాజరు కావడం జరిగింది.
ఇట్టి అసైన్ మెంట్ కమిటీలో నేడు తిరుమలగిరి సాగర్ మండలం నందు 13 గ్రామాలకు సంబంధించి ప్రభుత్వ భూములలో కాస్తు కబ్జా కలిగి యుండి సేద్యం చేయుచూ అర్హత కలిగిన సుమారు 4500 మందికి సుమారు 4000 ఎకరాలకు లావుని పట్టాలు జారీ చేయుటకు గాను ఆమోదించడం జరిగినది . త్వరలో అట్టి అర్హులకు అసైన్ మెంట్ పట్టాలు జారీ చేయడం జరుగుతుంది.
ఇట్టి ప్రాజెక్టులో భాగంగా ఇంతవరకు ధరణి లో నమోదు కానటువంటి పరేడ్ మరియు ఉడాఫా నెంబర్లను కూడా గుర్తించి ఆన్ లైన్ కి తీసుకురావడం జరిగినది.
ఇట్టి సమావేశంలో తిరుమలగిరి సాగర్ మండల తహశీల్దార్ మరియు పైలట్ ప్రాజెక్ట్ టీం లీడర్లు, డివిజన్ పరిధిలోని అందరూ తహశీల్దార్లు హాజరు కావడం జరిగినది.