Ultimate magazine theme for WordPress.

సిలిండర్ కు 50 రూపాయలు పంపు

Post top
home side top

ప్రజాలహరి….

*వంట గ్యాస్ ధరలను కేంద్రం పెంచింది. ఒక్కొ సిలండర్‌పై రూ.50 పెంచింది.* ఈ మేరకు పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్ సింగ్ పూరీ సోమవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. ఈ పెంపు ధర ఉజ్వల్ యోజన పథకం ద్వారా సిలండర్ పొందుతున్న లబ్దిదారులకు సైతం వర్తిస్తుందని స్పష్టం చేశారు.

దీంతో 14.2 కేజీ ఎల్పీజీ సిలండర్ ధర ప్రస్తుతం రూ. 803 ఉంటే.. ఇకపై దీని ధర రూ. 853 అవుతుందని తెలిపారు. అలాగే ఉజ్వల్ యోజన పథకం కింద అందుకొంటున్న *సిలండర్ ధర రూ. 503 నుంచి రూ. 553కు పెరిగిందని* వివరించారు. ఇక ప్రతి 15 రోజులకు లేదా ఒక నెలకు.. ఈ ధరలపై సమీక్షిస్తామన్నారు.ఇక 2024, ఆగస్ట్ నుంచి ఇప్పటి వరకు 14.2 కిలోల సిలిండర్ ధరలు పెంచలేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.

ఇక *పెట్రోల్, డీజిల్‌ ధరలను సైతం కేంద్రం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. లీటర్‌కు ఏకంగా రూ. 2 మేర పెంచింది.* ఈ ధరలు సోమవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. అయితే *పెరిగిన ఈ పెట్రోల్, డీజిల్ ధరలు.. వాహనదారులపై పడవని కేంద్రం క్లియర్ కట్‌గా పేర్కొంది.* ఆయా ధరలు ఆయిల్ కంపెనీలపై పడుతోందని వివరించింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.