యాదాద్రి పవర్ ప్లాంట్ లో భూములు కోల్పోయిన 121 మందికి నియామక పత్రాలు అందజేసిన ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

*ఆనందంతో భావోద్వేగానికి గురైన.. MLA *
మిర్యాలగూడ ప్రజాలహరి…. హైదరాబాద్ లోని ప్రగతి భవన్ నందు శుక్రవారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క * ఆధ్వర్యంలో MLC శంకర్ నాయక్ మరియు మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – దామరచర్ల మండలంలోని *యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్* నిర్మాణంలో ఇళ్లు కోల్పోయిన *R&R బాధితులకు 112 మందికి ఉద్యోగ నియామక పత్రాలు* అందజేయడం జరిగింది.. ఈ సందర్భంగా *MLA మాట్లాడుతూ నాకు తోడుగా ఉండి నన్ను గెలిపించుకున్న మా గిరిజన సోదరులకు , నేను గెలిస్తే వారికి న్యాయం జరుగుతుంది అని నన్ను నమ్మిన బాధితులకు ఈరోజు ఉద్యోగ నియామక పత్రాలు అందజేయడం చాలా గర్వంగా ఉందని అని భావోద్వేగానికి గురయ్యారు..
గత కొన్ని నెలలుగా ఈ కార్యక్రమం కోసం నిత్యం కృషి చేశామని వెంటనే స్పందించి ఉప ముఖ్యమంత్రి వర్యులు *భట్టి విక్రమార్క గారు* ఇంత తక్కువ సమయంలో బాధితులకు న్యాయం చేస్తున్నందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసారు..
*అలాగే ల్యాండ్ లూజర్స్ కి కూడా త్వరలోనే ఉద్యోగ నియామకాలు కల్పించాలని .. అదేవిధంగా ఫారెస్ట్ భూములు, ప్రభుత్వ భూములు కోల్పోయిన బాధితులకు ఉద్యోగాలు లేక CL గా తీసుకోవాలని కోరారు..*
అలాగే దామరచర్ల మండలంలో అత్యధికంగా గిరిజనుకు ఉన్నారని వారికి కోసం ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా ఇందిరమ్మ ఇళ్లు మంజూర్ చేయాలని కోరారు..
ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు..