
ఐ.డి.బి.ఐ బ్యాంకు వారు శెట్టిపాలెం పాఠశాలకు డెస్క్ బెంచీలు అందజేత
వేములపల్లి( ప్రజాలహరి): ఐ.డి.బి.ఐ బ్యాంక్ మిర్యాలగూడ శాఖ వారు సి.ఎస్.ఆర్ (కార్పొరేషన్ సోషల్ రెస్పాన్స్ బిలిటి) ద్వారా నల్గొండ జిల్లా వేములపల్లి మండలం లోని శెట్టి పాలెం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు లక్ష యాభై వేల రూపాయల ఖర్చుతో 35 డెస్క్ బెంచీలను గురువారం పాఠశాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు నీలం సత్యనారాయణ ఐ.డి.బి.ఐ బ్యాంకు వారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఐడిబిఐ బ్యాంక్ శాఖ మహారాష్ట్రలోని హెడ్ ఆఫీస్ ఆదేశానుసారాల మేరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి చదువుకునే పేద విద్యార్థులకు సరైన వసతులు కల్పించాలని ఉద్దేశంతో ఈ యొక్క డెస్క్ బెంచ్ లను అందజేయడం జరిగిందన్నారు. ముఖ్యంగా ఆయన విద్యార్థిని విద్యార్థులకు ఇచ్చిన సూచన ఏమనగా, ఐ.డి.బి.ఐ బ్యాంకు వారు అందజేసిన డెస్క్ బె బెంచ్ లలో కూర్చున్న ప్రతి విద్యార్థినీ విద్యార్థి తమ చదువులలో ప్రతిభను కనబరిచి ఎంతో ముందంజలో ఉండాలని విద్యార్థులకు సూచించారు. అంతేకాకుండా ముందు ముందు ఈ యొక్క బ్యాంకు ద్వారా ఒక మన పాఠశాలకు డెస్క్ బెంచీలు ఇచ్చినట్లుగానే మరెన్నో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలలకు బెంచీలను ఇచ్చే విధంగా చూడాలని ఆయన బ్యాంకు సిబ్బందిని కోరారు. బ్యాంక్ మేనేజర్ వెంకట సూర్య అన్నపూర్ణేష్ మంచికంటి, అసిస్టెంట్ మేనేజర్ బొడ్డుపల్లి రమేష్ గార్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు దైద సత్యం, ఎం వెంకటరెడ్డి, ఎం తిరుపతి, డి. రాజశేఖర్, బి.హేమ, రషీదా బేగం, ఎం. సుమన్, ఆర్ అఖిల, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.