
ప్రజాలహరి..2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక బడ్జెట్ను ప్రజా ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టింది. ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన మంత్రిమండలి సమావేశం వార్షిక బడ్జెట్కు ఆమోదముద్ర వేసింది. అనంతరం ఉప ముఖ్యమంత్రి తొలుత బడ్జెట్ ప్రతులను లాంఛనంగా ముఖ్యమంత్రి కి అందజేశారు.
✳️ ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క బడ్జెట్ను శాసనసభలో, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు శాసనమండలిలో ప్రవేశపెట్టారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి మొత్తం రూ. 3,04,965 కోట్ల వ్యయంతో బడ్జెట్ ప్రతిపాదించారు. బడ్జెట్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి గారు, మంత్రులు, ఇతర ప్రజా ప్రతినిధులు ఉప ముఖ్యమంత్రి గారిని అభినందించారు.
✳️ ఇది అభివృద్ధి, సంక్షేమం పట్ల నిబద్ధతతో కూడిన ప్రజాబడ్జెట్గా పేర్కొంటూ ఈ సందర్బంగా ముఖ్యమంత్రి ప్రజలకు అభినందనలు తెలియజేశారు.
✳️ ఉన్నతమైన లక్ష్యాలను నిర్ధేశించుకుంటూ సుసంపన్నత, సమగ్రత, మరియు స్థిరమైన అభివృద్ధితో కూడిన తెలంగాణను నిర్మిస్తామని 72 పేజీల బడ్జెట్ ప్రసంగంలో ఉప ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. గడిచిన 15 నెలల పాలనలో ప్రధానంగా సంక్షేమ రంగంలో తీసుకున్న చర్యలను సమగ్రంగా వివరిస్తూ భవిష్యత్తు ప్రణాళికను బడ్జెట్లో ఆవిష్కరించారు.