Ultimate magazine theme for WordPress.

ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

Post top
home side top

ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి

నికర జీతం 18000 ప్రకటించారు

వేములపల్లి( ప్రజాలహరి) ప్రభుత్వాలు మారిన మా జీవితాలు మార్చలేని నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలోని ఆశా వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ, ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ, నికర జీతం 18000 ఇవ్వాలని, సోమవారం మండల రెవెన్యూ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి మండల డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేశారు. రాష్ట్రంలో ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతంలో నివాసం ఉంటూ పేద మహిళలకు, గర్భిణీ స్త్రీలకు నిత్యం అందుబాటులో ఉండి వారు వివిధ రకాల సేవలు అందిస్తూ పని చేస్తున్నటువంటి వారికి ప్రభుత్వం నేటి వరకు అట్టి ఆశా వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకపోవడం సోషనీయమని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రతినిత్యం ఉదయం నుంచి సాయంత్రం వరకు మహిళలకు, బాలింతలకు, గర్భిణీ స్త్రీలకు. అందుబాటులో ఉండి వారికి నిత్యం సేవ చేస్తున్నటువంటి వారిని గుర్తించకుండా వారికి ఒక నికర జీతం అంటూ ఇవ్వకపోవడం చాలా దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న రేపు శాసనసభలు ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో ఆశా నికర జీతం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించేటట్టుగా బడ్జెట్లో ప్రవేశపెట్టాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన వెంట సిపిఎం మండల పార్టీ కార్యదర్శులు శశిధర్ రెడ్డి, ప్రజా సంఘం నాయకులు వడ్డీ గాని సైదులు, అయితే గాని విష్ణు, పుట్టల విగ్నేశ్వరి, పుట్టినరోజు రాధిక, దైద ప్రేమలత, సుజాత, నాగమ ణి సైదమ్మ, కవిత, రజిత తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.