
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
టిఆర్ఎస్ జిల్లా నాయకులు కట్ట మల్లేష్ గౌడ్
వేములపల్లి( ప్రజాలహరి) ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కట్ట మల్లేష్ గౌడ్ అన్నారు. శుక్రవారం నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గం లోని శెట్టిపాలెం గ్రామంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మహిళలు పురుషుల కంటే దేంట్లో తక్కువ కారని, మహిళలు అన్ని రంగాలను ముందంజలో ఉంటున్నారని ఆయన సూచించారు. అంతేకాకుండా శ్రీని ఒక దేవతల చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు, ఎందుకంటే సృష్టికి మూల కర్త శ్రీ అని ఆయన సూచించారు. ముఖ్యంగా నేడు మహిళలు చట్టసభల్లో కూర్చోవడమే కాకుండా మహిళలు భారత దేశ ప్రధాని అయినటువంటి సంఘటన కూడా మనదేశంలో ఉన్నది, అందుకనే ప్రతి మహిళను గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన కొనియాడారు. ముఖ్యంగా రాబోయే రోజుల్లో మహిళలకు 33% రిజర్వేషన్ వచ్చినట్లయితే చట్టసభల్లో పురుషులతో సమానంగా ఉంటారని ఆయన అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8వ తారీఖున ఉండగా రేపు అనగా 8 వ తారీకు సెలవు ఉన్నందున శెట్టిపాలెం గ్రామంలో ఈరోజు అనగా ఏడవ తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి శెట్టిపాలెం గ్రామం పి ఎస్ సి ఎస్ చైర్మన్ శేఖర్, గ్రామ తాజా మాజా సర్పంచ్ మజ్జిగ పద్మ సుధాకర్ రెడ్డి, గౌడ్ శ్రీనివాస్ గుప్తా, కాట్రగడ్డ రాజగోపాల్ రావు, పెదమం సైదులు వీరి సహాయ సహకారాలతో ఇట్టి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ కార్యదర్శి నవీన్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ మజ్జిగ పద్మ, జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల ఉపాధ్యాయురాలు రషీదా బేగం, రాచూరి వసంత, నక్క సోమ, సిరిమరి సంధ్య, నక్క సుభద్ర, ఈసం విమలమ్మ, కోడి రెక్క జయమ్మ, నిమ్మల నాగమ్మ, ధూపాటి నాగలక్ష్మి, కట్టా మట్టమ, చిరుమరి ఆదిలక్ష్మి, పెదమం స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు