పేదింటి ఆడబిడ్డకు అండగా శ్రీరామ్ రెడ్డి
వేములపల్లి( ప్రజాలహరి) పేదింటి ఆడబిడ్డకు అండగా మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి శ్రీరామ కళ్యాణ కానుకను నల్గొండ జిల్లా వేములపల్లి మండలంలోని రావులపెంట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ శ్రీరామ్ రెడ్డి , ఆ గ్రామానికి చెందిన బయ్య సాడయ్య సైదమ్మ దంపతుల కుమార్తె మహేశ్వర్ కి, అదే గ్రామానికి చెందిన పోలేబోయిన ఏడుకొండలు నాగలక్ష్మి దంపతుల కుమార్తె త్రివేణి వివాహాలకు జైశ్రీరామ్ కళ్యాణమస్తు కానుకను మాజీ ఎంపిటిసి నంద్యాల శ్రీరామ్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ఏ ఆడబిడ్డకైనా కుల, మత తేడా లేకుండా పార్టీలకతీతంగా వివాహం చేసుకున్నటువంటి ప్రతి మహిళా యువతకి తన వంతు సహాయంగా జైశ్రీరామ్ కళ్యాణమస్తు కానుకను అందజేయలు ఉన్నట్లుగా ఆయన తెలిపారు. గ్రామ ప్రజలకు నేను సేవ చేయాలని తపనతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్టుగా ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు సందనబోయిన చంద్రయ్య, మాజీ గ్రామ ఉపసర్పంచ్ తరి సైదులు, బి ఆర్ సీనియర్ నాయకులు తరిగొప్పుల వెంకటేశ్వర్లు, బరిగెల బిక్షం, అశోక్ శీను, వెంకన్న, కత్తుల సైదులు, జిన్నశివరెడ్డి, చింటూ, మహేష్, నాగరాజు, వినయ్, సైదులు తదితరులు పాల్గొన్నారు