మిర్యాలగూడ ప్రజాలహరి.పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి రైతాంగానికి సాగు,తాగు నీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి అన్నారు.నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంలోని అడవిదేవలపల్లి మండలంలో నిర్మాణ దశలో ఉన్న దున్నపోతుల గండి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులను ఇరిగేషన్ అధికారులతో ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి కలిసి పరిశీలించారు.దున్నపోతుల గండి లిఫ్టును త్వరితగతిన పూర్తి చేయాలని ఇరిగేషన్ ప్రాజెక్టు అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు.వచ్చే ఏడాది లోగా రైతులందరికీ సాగు నీరు అందించడమే లక్ష్యంగా పని చేయాలి అని అధికారులను ఆదేశించారు..కాంట్రాక్టర్లు కూడా ప్రాజెక్టు ను త్వరితగతిన పూర్తి పూర్తి చేయాలన్నారు.అదేవిధంగా వారికి నిధుల కొరత లేకుండా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి,జిల్లా మంత్రికోమటి రెడ్డి వెంకట్ రెడ్డి,నల్గొండ పార్లమెంట్ సభ్యులు రఘువీర్ రెడ్డి యొక్క సహకారంతో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలో ఏటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని కాంట్రాక్టర్లకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.