స్పెషల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనం తనిఖీ
వేములపల్లి( ప్రజాలహరి) వేములపల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి టీఎస్ మోడల్ స్కూల్లో శనివారం వేములపల్లి మండల స్పెషల్ ఆఫీసర్ బి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మధ్యాహ్న భోజనం నిర్వహిస్తున్నటువంటి వారిని, పాఠశాల సిబ్బందిని ఈరోజు అధికారులు వచ్చిర్రని మధ్యాహ్న భోజనం మంచిగా చేశారు. ఇది మధ్యాహ్నం భోజనం ప్రతిరోజు ఇలాగనే ఉండాలని మధ్యాహ్న భోజనం నిర్వహించేటటువంటి వారిని, పాఠశాల సిబ్బందిని హెచ్చరించారు. అనునిత్యం భోజనం సరిగా లేనట్లయితే విద్యార్థులు నేరుగా నాకు ఫోన్ చేయొచ్చని ఆయన తెలిపారు. ఒకవేళ భోజనం సరిగా లేదని పాఠశాల సిబ్బంది పట్టించుకోనట్లయితే వారిపై జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వెంట వేములపల్లి ఎంపీడీవో శారదా దేవి, కుక్కడం కస్తూరిబాయి ఎస్ ఓ సునీత, పాఠశాల ప్రిన్సిపాల్ వసంత, వేములపల్లి ఎస్ ఐ డి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.