
జాతీయ ప్రాతికేయుల దినోత్సవం సందర్భంగా సామాజికవేత్త డాక్టర్ రాజు చేతుల మీదుగా సీనియర్ జర్నలిస్టులకు సన్మానం.. (మిర్యాలగూడ ప్రజాలహరి.)… ప్రాతికేయులు సమాజానికి మార్గదర్శకులని ప్రముఖ సామాజిక వాది డాక్టర్ జె రాజు అన్నారు. శనివారం మిర్యాలగూడ పట్టణంలో జాతీయ పాత్రికేయుల దినోత్సవo ను పురస్కరించుకొని సీనియర్ జర్నలిస్టులను సన్మానించారు. ప్రజాలహరి ఎడిటర్ చిట్యాల శ్రీనివాసరావు, అన్వేషి ఎడిటర్ అన్నెబోయిన మట్టయ్య, పయిలం ఎడిటర్ పేర్ల వెంకటయ్య, సీనియర్ జర్నలిస్టు నూకల వెంకటరెడ్డి, మన నేటి తెలంగాణ మిర్యాలగూడ బ్యూరో ఇంచార్జ్ అలుగుబెల్లి వెంకట్ లను శాలువాలతో సన్మానించి,
నోట్ బుక్స్, పెన్నులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్నలిస్టులు ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ పని చేస్తున్నారని వారు ప్రజా సమస్యలపై అనేక పోరాటాలు చేశారని ఎన్నో భూములపై కూడా పోరాటాలు చేసి ప్రభుత్వాన్ని తీసుకువెళ్లారని చెప్పారు. నిత్యం ప్రజలకు పనిచేస్తూ వారి సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. నిరుపేదలకు కోసం పని చేసేది ప్రాతికేయులని చెప్పారు.