
వికారాబాద్ కలెక్టర్ పై దాడికి నిరసనగా రెవెన్యూ ఎంప్లాయిస్ నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ..
(మిర్యాలగూడ ప్రజాలహరి) వికారాబాద్ కలెక్టర్, అదనప కలెక్టర్, సబ్ కలెక్టర్, కడా అధికారులపై ప్రజలు తిరుగుబాటు చేసి దాడి చేయడానికి నిరసిస్తూ మంగళవారం రెవిన్యూ అధికారులు నల్ల బ్యాడ్జీలు ధరించి మిర్యాలగూడ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఔషధ పరిశ్రమ ఏర్పాటు కై భూసేకరణ కోసం వచ్చిన అధికారులను భయబ్రాంతులకు గురి చేసి వారి వారిపై దాడి చేయడo సరైన కాదని మిర్యాలగూడ ఎమ్మార్వో హరిబాబు, అడవిదేవులపల్లి ఎమ్మార్వో సురేష్ కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లు రామకృష్ణ సత్యనారాయణ ఏఎస్ఓ రవీందర్ రెడ్డి, రెవిన్యూ ఉద్యోగులు మృదుల, అనిత సంధ్య ,తిరుమలేష్, భాష కళ్యాణి ,సైదులు సత్య ,అశోక్, శివ పాల్గొన్నారు