Ultimate magazine theme for WordPress.

సామాజిక సేవకు నిలువెత్తు నిదర్శనం స్వర్గీయ రామానుజాచార్యులు

Post top
home side top

, మిర్యాలగూడ లో నిత్యము ఉచిత కంటి ఆపరేషన్లు జరుగుతున్నాయంటే ఆ ఖ్యాతి ముడుంబై రామానుజారులకే దక్కుతుందని పలువురు వక్తలు పేర్కొన్నారు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పలువురుకు ఆదర్శప్రాయంగా ఉంటూ వస్తున్నారని చెప్పారు ఆయన వారి అన్న గారి పేరుట ఉచితంగా స్థలాన్ని కంటి ఆసుపత్రికి కేటాయిస్తూ కంటి ఆసుపత్రి నిర్మాణంలో కీలక భాగస్వామ్య వ్యవహరించాలని మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి పేర్కొన్నారు ఎందరో విద్యార్థులు పోటీ పరీక్షలకు ఉచితంగా అజ్ఞాత సౌకర్యాలతో కూడిన లైబ్రరీలో స్టడీ చేస్తున్నారంటే రామానుజారులకు కృషి కూడా ఉన్నది మిర్యాలగూడ గ్రంధాలయానికి ఎప్పటికప్పుడు ఫ్యాన్లు లైట్లు జనరేటర్లు పుస్తకాలు వాటిని దాతల ద్వారా సమీకరిస్తూ విద్యార్థులకు అందించి వారి లక్ష సాధనలో ఆయన పాత్ర అమోఘమని మాజీ ఎమ్మెల్యే భాస్కర్ రావు అన్నారు ఇదే కాకుండా మిర్యాలగూడ లయన్స్ క్లబ్బులో ప్రముఖంగా వ్యవహరిస్తూ ఈ ప్రాంతంలో లయన్స్ క్లబ్ సేవలు పేద ప్రజలకు అందే విధంగా చేసిన ఘనత ఆయనకే చెందుతుందని లయన్స్ క్లబ్ సభ్యులు పేర్కొన్నారు. ప్రముఖ మాజీ మంత్రి జానారెడ్డి, జూలకంటి రంగారెడ్డి ప్రస్తుత మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు సిడి రవికుమార్, పి సుబ్బారావు ఒకనాటి కాంగ్రెస్ దిగ్గజం గంగాధర్ , పాటు పుర ప్రముఖులందరూ రామానుజ చార్యులు ఒక పని చెప్పారంటే అది ప్రజల కోసము సామాజిక సేవ కోసం అని ఒక దడమైన అభిప్రాయం కలిగి ఉండేవారు అనేది అతిశయోక్తి కాదని సభలో పాల్గొన్న పలువురు వక్తలు పేర్కొన్నారు… ఆయన పరమపదించి సంవత్సరకాలం సందర్భంగా వారిని గుర్తు చేసుకునే కార్యక్రమంలో భాగంగా శనివారం మిర్యాలగూడలోని బృందావన్ గార్డెన్స్ లో కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారి సతీమణి ముడుంబై మంగతాయారు వారి కుమార్తె అల్లుళ్లు ఆయన జ్ఞాపకార్థం సుమారు 20 నుంచి 30 పేద విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు .
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి….
మిర్యాలగూడ ప్రజాలహరి….. మిర్యాలగూడ పట్టణానికి చెందిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత స్వర్గీయ రామానుజాచార్యుల ప్రధమ వర్ధంతి కార్యక్రమం మిర్యాలగూడ పట్టణంలోని బృందావన్ గార్డెన్స్ లో జరిగింది. మిర్యాలగూడ లయన్స్ క్లబ్ మరియు కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగ కుటుంబ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేశారు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా పలువురు పేద విద్యార్థులకు ఇటోదిక సహాయాన్ని అందించారు

post bottom

Leave A Reply

Your email address will not be published.