Ultimate magazine theme for WordPress.

తెలంగాణ ఆవిర్భావన రోజున ప్రభుత్వ హై స్కూల్స్లో స్వీపర్లకు తన వేతనాన్ని ప్రకటించిన మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి

Post top
home side top

వినూతన ప్రకటనలతో అందరిని ఆశ్చర్యపరుస్తున్న మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి…..

 

మిర్యాలగూడ ప్రజాలహరి..

 

*తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం* సందర్భంగా మిర్యాలగూడ శాసనసభ్యులు * బత్తుల లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో MLA క్యాంప్ కార్యాలయం నందు ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది..అనంతరం అమరవీరుల స్థూపం నందు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరులైన అమరవీరులకు నివాళులు అర్పించడం జరిగింది… ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో అమరులైన అమరవీరుల స్థూపం సాక్షిగా మన మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని ప్రతీ *ప్రభుత్వ హై స్కూల్స్ లోని స్వీపర్స్ కి ప్రతీ నేలా నాకు ప్రభుత్వం నుంచి వచ్చే వారి జీతం నుంచి వారికి కొంత రుసుము అందజేస్తానని అన్నారు.. అలాగే అతి త్వరలోనే మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాలు, తండాలు పర్యటించి , గ్రామస్థులు, అధికారులతో పాటు సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి గత 10 ఏళ్లలో జరిగిన అభివృద్ధి ఎంటి అనే విషయంలో సమాచారం సేకరించి , గ్రామస్థులతో మాట్లాడి వారి ప్రస్తుత సమస్యల గురించి తెలుసుకొని పరిష్కారం చేయడం జరుగుతుంది .. అదే విధంగా మిర్యాలగూడ పట్టణంలోని ప్రతీ వార్డు కూడా సాయంత్రం పర్యటించి వారి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది అని అన్నారు*. ఈ కార్యక్రమ పూర్తి ప్రణాళిక అతి త్వరలోనే ప్రకటిస్తాం అని అన్నారు.. అలాగే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమ కారులను, అమరులైన అమరవీరులను చరిత్ర ఎప్పటికీ మరిచిపోకూడదు .. వారి అందరి త్యాగ ఫలితమే మన ఈ తెలంగాణ రాష్ట్రం అని అన్నారు.. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్కరి కష్టమో పోరాటమే కాదు, కవులు, కళాకారులు, విద్యార్థులు, విద్యావంతులు, ఉద్యోగ, ఉద్యమ సంఘాలు ఇలా సకలజనుల కలిసి పోరాడి సాధించుకున్నది.. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన *శ్రీమతి సోనియా గాంధీ కి* కూడా ప్రతిఒక్కరం కృతజ్ఞతలు తెలియజేయాలని అన్నారు… ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.