Ultimate magazine theme for WordPress.

సూర్యాపేటలో ఓటేస్తున్న జగదీశ్ రెడ్డి

Post top
home side top

ప్రజలందరూ తమ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని విధిగా ఓటు వేయాలి

 

ఓటుని సరిగ్గా వినియోగించుకొకపోతే బాధలు తప్పవు

 

అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మార

 

కేసీఆరే తెలంగాణ కు శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారు

 

లోక్ సభ ఎన్నికల్లో ఊహిస్తున్న మార్పు వస్తుందని ఆశిస్తున్నాం

➖➖➖➖➖➖➖➖

సూర్యాపేటలో ఓటు హక్కు వినియోగించుకున్న మాజీ మంత్రి ,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి

➖➖➖➖➖➖➖➖

 

 

*సూర్యాపేట*ప్రజాలహరి …

 

అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణా ప్రజలు ఇచ్చిన తీర్పు ఇప్పుడు మారనుందని, ఐదు నెలల్లో ప్రజల ఆలోచనల్లో పెను మార్పులు వచ్చాయని మాజీ మంత్రి,సూర్యాపేట శాసన సభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. పార్లమెంటు ఎన్నికల పోలింగ్ సందర్భంగా సూర్యాపేటలోని శ్రీ చైతన్య స్కూల్ పోలింగ్ బూత్ లో జగదీష్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ లేనిలోటు స్పష్టంగా కనపడుతుందని ప్రజలే చెబుతున్నారని అన్నారు. ప్రజలు. ప్రజా స్పందన చూస్తుంటేమెజారిటీ సీట్లు మావే అనే నమ్మకం కలుగుతుంది అన్నారు.

కేసీఆరే తెలంగాణ కు శ్రీరామ రక్ష అని ప్రజలు భావిస్తున్నారని అన్నారు.లోక్ సభ ఎన్నికల్లో ఊహిస్తున్న మార్పు వస్తుందని ఆశిస్తున్నాం అన్నారు. ప్రజలందరూ తమ భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని విధిగా ఓటు కును వినియోగించుకోవాలని కోరారు.ఓటుని సరిగ్గా వినియోగించుకొకపోతే జరగబోయే నష్టానికి మనమే బాధ్యులమవుతామని పేర్కొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.