
మిర్యాలగూడ ప్రజాలహరి..
ఈరోజు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ పట్టణంలోని *NSP క్యాంప్ గ్రౌండ్ నందు మార్నింగ్ వాక్* లో వాకర్స్ తో కలసి మాట్లాడిన నల్గొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి , మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా వారు వాకర్స్ తో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు .. ఎన్నికల అనంతరం అతి త్వరలోనే వారి సమస్యలను పరిష్కరిస్తామని అన్నారు .. అనంతరం మిర్యాలగూడ రైతు మార్కెట్ సందర్శించి రైతులతో మాట్లాడారు.. అనంతరం బస్టాండ్ ఎదురుగా గల సంతోష్ టీ స్టాల్ వద్ద టీ తాగుతూ స్థానికులతో చర్చించారు . అనంతరం మున్సిపల్ కాంప్లెక్స్ నందు గల కార్మికుల అడ్డా నందు కార్మికులతో మాట్లాడారు. అనంతరం అమ్మ హోటల్ నందు అల్పాహారం చేసారు. మిర్యాలగూడ నియోజకవర్గం నుంచి అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేసి గెలిపించాలని అన్నారు. వారితోపాటు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.