Ultimate magazine theme for WordPress.

కెసిఆర్ రైతు భరోసా యాత్ర

Post top
home side top

రైతన్న కోసం కేసీఆర్ పొలం బాట  ప్రజాలహరి.  హైదరాబాద్

కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వం, అసమర్ధతతో.. కరీంనగర్‌ జిల్లా రూరల్‌ మండలం ముగ్ధుంపూర్‌లో ఎండిపోయిన పంటలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరిశీలించారు. ఈ సందర్భంగా పొలాలకు నీటి సమస్యలపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలువురు రైతులు కేసిఆర్ ముందు సమస్యలు ఏకరువు పెట్టారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందవుతుందని తెలిపారు. గత సంవత్సరం నీరు సంవృద్ధిగా ఉండేదని… ఇప్పుడు పొలమంతా ఎండిపోయింది. ఒకసారి వాగులోకి నీళ్లిస్తే రైతులందరు బతుకుదురని చెప్పారు. స్పందించిన కేసీఆర్‌ రైతులకు బీఆర్‌ఎస్‌ అన్ని విధాలా అండగా ఉంటుందన్నారు. రైతులు ధైర్యంగా ఉండి పోరాటం చేయాలన్నారు. రైతులకు బీఆర్‌ఎస్‌ మద్దతు ఉంటుందని తెలిపారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.