Ultimate magazine theme for WordPress.

సమాభావన సంఘం డబ్బులు స్వాహా

Post top
home side top

ఫోర్ జేరి సంతకాలతో డబ్బులు కాజేసిన మహిళ

బ్యాంకర్ల వాటా ఎంత?

వెలుగు ఆఫీస్ వాటా ఎంత?

వేములపల్లి (ప్రజాలహరి) మండలంలోని రావులపెంట గ్రామంలోని దుర్గ భవాని సంఘం సభ్యురాలు అయిన పిట్టల మంగమ్మ అను సభ్యురాలు సుమారుగా ఐదు లక్షల పైచిలుకు, రూపాయలు కాజేసిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు వెళ్ళితే సంఘం సభ్యురాలు దుర్గమ్మ, మొదటి లీడర్ గా వ్యవహరిస్తూ రెండవ లీడర్ సంధకమును ఫోర్ జేరిచేసి, మిగతా సభ్యులు సంతకాలు సైతం దొంగ సంతకాలు పెట్టి మిర్యాలగూడ లోని ఏపీజీవీబీ గ్రామీణ వికాస్ బ్యాంకు లో ఐదు లక్షల కు పైగా లోను తెచ్చి అందులో ఉన్నటువంటి సభ్యురాళ్లకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తను ఒక్కతే ఒక వాహనం కొనుక్కొని జీవనం సాగిస్తుంది. దీంతో ఆ సంఘంలో ఉన్నటువంటి మిగతా సభ్యులు సైతం దుర్గమ్మ వాహనం కొనుక్కొని దర్జాగా జీవనం సాగిస్తుండగా, మిగతా సభ్యులంతా మనం కూడా అభివృద్ధిలోకి రావాలని ఉద్దేశంతో 9 మంది సభ్యులు క్రమం తప్పకుండా ప్రతినెల ఆమెకు డబ్బులు ఇస్తున్నారు. అట్టి డబ్బులను ఆమె బ్యాంకులో జమ చేయకుండా తన అవసరాలకు వాడుకుంటూ ఉండడంతో, విషయం కాస్త అక్కడ ఇక్కడ పడి మిగతా సభ్యులకు డబ్బులు జమ చేస్తాలేదన్న విషయం తెలిసిపోయింది. దీంతో సభ్యులందరూ ఏకమై ఆమెను నిలదీసినారు. దాంతో ఆమె దగ్గర నుండి ఎలాంటి సమాధానం రాలేదు అసలు ఏం జరిగింది అని సభ్యులంతా గ్రామీణ వికాస్ బ్యాంకులో జరిగితే లోన్ తెచ్చినట్టుగా బయటపడింది. ఈ విషయంపై సభ్యులందరూ వెలుగు ఆఫీసర్లను అడగగా వారు మాకు ఏం తెలియదు అంటూ సమాధానం దాటవేశారు. దీంతో సభ్యులందరూ ఆగ్రహంతో కూడి బ్యాంక్ అధికారులపై, వెలుగు అధికారులపై శుక్రవారం వేములపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది

post bottom

Leave A Reply

Your email address will not be published.