
రఘువీర్ కు ఎంపీ టికెట్ వచ్చిన సందర్భంగా బాణాసంచాలు
వేములపల్లి (ప్రజాలహరి) తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రానున్న పార్లమెంటు ఎన్నికలను దృశ్యపెట్టుకొని ఇటీవల కాలంలో మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి తనయుడు అయిన, కుందూరు రఘువీర్ రెడ్డికి నల్గొండ పార్లమెంటు టికెట్ ఇచ్చిన సందర్భంగా వేములపల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం బాణాసంచాలు పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వేములపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాలికాంత రెడ్డి ఆధ్వర్యంలో బాణాసంచాల పేల్చిన అనంతరం ఆయన మాట్లాడుతూ, గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఆరు హామీలను నెరవేర్చిందని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏరోజైనా ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి పథకాలను ప్రవేశపెట్టిన అట్టి పథకాలను అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంటుందని ఆయన అన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దాటికి తెలంగాణ రాష్ట్ర పార్టీ ఎలా కనుమరుగు అయిపోయిందో, అలానే రానున్న పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు సంఘం నాయకులు తంగేళ్ల సత్తిరెడ్డి, జిల్లా కాంగ్రెస్ నాయకులు పాదూరు కిరణ్ రెడ్డి, రావు ఎల్లారెడ్డి, మండల పార్టీ నాయకులు పుట్టల గురువయ్య, మండల పార్టీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పేరు మల్ల నాగేష్, మండల మైనార్టీ నాయకులు హాజీ, రాష్ట్ర ఎన్ఎస్ ఐ నాయకులు బొంగర్ల వినోద్, కోట సుందర్, పెద్దపంగు రాము, తదితరులు పాల్గొన్నారు.