
అమరుల త్యాగాలు గుర్తుగా ఇచ్చిన తెలంగాణను కొందరు దుష్టులు నాశనం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…. ప్రజాలహరి, మహబూబ్నగర్….. అమరుల త్యాగాల ఫలితం గుర్తుంచుకొని సోనియాగాంధీ తెలంగాణ ఇస్తే కొందరు దుష్టులు తెలంగాణను నాశనం చేశారని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఈ తెలంగాణను సరిచేస్తున్నానని పేర్కొన్నారు. మోడీ అయినా కేడి అయిన ఎదురెొడ్డి పోరాడుతానని చెప్పారు నిన్నటి నిన్న ప్రధాని మోడీ సభలో తెలంగాణకు అభివృద్ధికి నిధులు ఇవ్వాలని గుజరాత్కిచ్చినట్టుగానే మాకు ఇవ్వాలని కోరానని చెప్పారు . పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ యువత ఇవ్వాలని కోరానని చెప్పారు అతిధిగా వచ్చిన ప్రధానికి గౌరవం ఇచ్చానని ఒకవేళ ప్రధాని గాని జనతా పార్టీ గాని మేము ఇచ్చిన విజ్ఞప్తులకు స్పందించకపోతే చాకి రేవు పెడతానని చెప్పారు. బి ఆర్ఎస్ అంటే బిల్లా రంగమని విమర్శించారు. కెసిఆర్ కుటుంబం మతిభ్రమించి ఇష్టారాజ్యంగా విమర్శిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కేడి పది సంవత్సరాలు అధికారంలో ఉండి పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా తీసుకురాలేదనీ పరిశ్రమలు తీసుకురాలేదనీ విమర్శించారు. పాలమూరులో ఉన్న ప్రాజెక్టులను త్వరగా పూర్తిచేసి నీళ్లు ఇవ్వాలని అధికారులకు మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి సూచించానని చెప్పారు. పాలమూరు జిల్లాను దేశంల అగ్రగామిగా ఉంచుతానని చెప్పారు. శాసనమండలి ఎన్నికల లో జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు.