
ఆదిలాబాద్ లో పర్యటించిన ప్రధానమంత్రి మోడీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన మోడీ… హైదరాబాద్ ప్రజాలహరి..
ఈరోజు తెలంగాణలో పర్యటించటం తన సంతోషంగా ఉందని భారత ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు ఆదిలాబాద్ లో ఎన్టిపిసి విద్యుత్ ప్లాంట్ మరియు రహదారులు ప్రారంభానికి ఆయన బటన్ నొక్కారు .ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని తెలంగాణలో విద్యుత్ సమస్యను పరిష్కరించడానికి 1600 మెగావాట్ల ఎన్టిపిసి పవర్ ప్లాంట్ నిర్మిస్తున్నట్లు కూడా ఇస్తున్నట్లు చెప్పారు. అదిలాబాద్ గొండ్రు బిడ్డల మ్యూజియం త్వరలో హైదరాబాదులో ఏర్పాటు చేస్తామని చెప్పారు అదేవిధంగా ఆదిలాబాద్ మరియు తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు ఏడు జాతీయ టెక్స్టైల్ ప్రాజెక్టులో ఒకటి తెలంగాణ కేటాయించినట్లు చెప్పారు హైదరాబాద్ అభివృద్ధికి పలుకై రక్షణ శాఖ నుంచి భూములు బదలాయించినట్లు ఫ్లై ఓవర్స్ నిర్మాణానికి అనుమతి ఇచ్చినట్లు పేర్కొన్నారు.