
ప్రధాన మంత్రి మోడీ మాకు పెద్దన్న.. ఎన్ టి పి సి లో తయారయ్య విద్యుత్ లో 85% మాకే ఇవ్వాలి ….ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…… ప్రజాలహరి హైదరాబాద్….. తెలంగాణ రాష్ట్రంలో ఎన్టిపిసి నిర్మించే విద్యుత్ పవర్ ప్లాంట్లకు తమ పూర్తి సహకారం అందిస్తామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఇందులో తయారీ 85% విద్యుత్తు తమకే కేటాయించాలని ఈ సందర్భంగా కోరారు. హైదరాబాదులో రక్షణ శాఖాలు భూములు కేటాయించడం తమ సంతోషంగా ఉందని అన్నారు. ఆదిలాబాద్ లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నర్ సౌందర్య రాజన్ స్వాగతం పలికారు. తెలంగాణలో ఉన్న పలు సమస్యలను ప్రధాన మంత్రి దృష్టికి వెళ్లారు. గుజరాత్ మోడల్ ను తెలంగాణలో అమలు చేస్తామని చెప్పారు. మెట్రోపాలిటన్ సిటీ డెవలప్మెంట్ గా హైదరాబాదును చేయడానికి కురిచేస్తున్నామని అందుకు తమరు సహకరించాలని కోరారు. మెట్రో రైల్, మూసి రివర్ ప్రాజెక్టుకు పూర్తి సహకరించాలని కోరారు. ఆదిలాబాద్ లో తుమ్మిడి హట్టి ప్రాజెక్టు నిర్మాణానికి సహకరించాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మంచి సంబంధాలు కొనసాగిస్తుందని చెప్పారు. వారి సూచనలు సలహాలతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాము చెప్పారు.