
మిర్యాలగూడ ప్రజాలహరి….మిర్యాలగూడ నియోజకవర్గంలో దామరచర్ల మండలంలో వీర్లపాలెం గ్రామంలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రంలో నిర్వహించిన పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో మిర్యాలగూడ నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నల్లమోతు భాస్కర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత కేసిఆర్ ప్రభుత్వం విద్యుత్ సమస్య భావితరాలకు ఉండకూడదని ఆలోచనతో భారీ స్థాయిలో యాదాద్రి ఏర్పాటు కృషి చేశారని అందుకు ఆయన కృషిని అభినందించాలని చెప్పారు ప్లాంట్ ఏర్పాటుకు కావలసిన అనుమతులు తమ ప్రభుత్వం ఇప్పించిందని చెప్పారు ఇప్పటికీ 80% ప్లాంట్ నిర్మాణం పూర్తయిందని పేర్కొన్నారు యాదాద్రి ప్లాంటు కేసీఆర్ కృషి వల్లనే జరిగిందని చెప్పారు