మిర్యాలగూడ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడుగా వేణుగోపాల్ రెడ్డిని కొనసాగించాలి ఏకగ్రీవ తీర్మానం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు

ఈరోజు మిర్యాలగూడ పట్టణంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్ష పదవి కొనసాగింపు పై చర్చించుటకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు వార్డు ఇన్చార్జిలు సమావేశం కావడం జరిగింది
ఈ సమావేశంలో మిర్యాలగూడ పట్టణ అధ్యక్షుడిగా నూకల వేణుగోపాల్ రెడ్డి ని కొనసాగించాలని కౌన్సిలర్లు ఇన్చార్జిలు ఏకగ్రీవ తీర్మానం చేయడం జరిగింది. పట్టణ సమస్యలపై పూర్తిపట్టు ఉన్నటువంటి అదేవిధంగా మున్సిపల్ సమస్యలపై పూర్తి అవగాహన ఉన్నటువంటి నూకల వేణుగోపాల్ రెడ్డి అధ్యక్షుడిగా ఉండటం వల్ల రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లలో మరియు మున్సిపల్ ఎలక్షన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడానికి మార్గం సుగమం అవుతుందని కాబట్టి మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు వివాదానికి కాంగ్రెస్ పార్టీ పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు ఇన్చార్జీలు ఏకగ్రీవంగా ఆమోదించడం వల్ల వివాదానికి తెరదించినట్లు అయిందని, పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నూకల వేణుగోపాల్ రెడ్డిని పరిగణించాలని పార్టీ పెద్దలకు తెలియపరచుటకు తీర్మానించనైనది. అలాగే మున్సిపాలిటీలో గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వివక్షతతో పరిపాలించి అనేక సమస్యలను పరిష్కరించకుండా స్వలాభం కొరకు పని చేసినారని అలా కాకుండా పార్టీలకతీతంగా పట్టణంలో ఉన్న సమస్యలను సమిష్టిగా చర్చించుకుని మున్సిపల్ కౌన్సిల్లో సమస్యలు పరిష్కారమయ్యే విధంగా చర్చించి రాబోయే ఎన్నికల్లో అన్ని మున్సిపల్ స్థానాలను గెలుచుకోవాలని సమస్యలపై పై నాయకులు దృష్టికి తీసుకెళ్లి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ నాయక్ కి కాంగ్రెస్ పార్టీ పెద్దలు కుందూరు జానారెడ్డి కి, జిల్లా మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కి,శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి కి విన్నవించుకుంటూ ఏకగ్రీవ తీర్మాన పత్రాలను వారికి పంపించడం జరిగింది.
రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మన నల్లగొండ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరవేయాలని అందులో మన మిర్యాలగూడ నియోజకవర్గం నుండే అత్యధిక మెజార్టీని అందివ్వాలని దానికి ప్రతి ఒక్కరం సమిష్టిగా కృషి చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో అందరూ కౌన్సిలర్లు అందరూ ఇన్చార్జిలు పాల్గొనడం జరిగింది.