
మిర్యాలగూడ దామరచర్ల ప్రజాలహరి….ఈరోజు దామరచర్ల మండలం బాలాజీ నగర్ తండా నందు *నాగ బ్రదర్స్ ఫౌండేషన్* వారి ఆధ్వర్యంలో *శ్రీ విజయ హాస్పిటల్* వారి సహకారంలో నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంప్ ని ప్రారంభించిన మిర్యాలగూడ *శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి మారుమూల గ్రామాలలో, తండాలలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి సేవలు అందిస్తున్నందుకు నిర్వాహకులు నాగు నాయక్ ని అభినందించారు… మారుమూల గ్రామాలలో విద్య, వైద్యం అందజేసే దిశగా కృషి చేస్తున్న సామాజిక సేవా సంస్థలకు*మా వంతు సహాయ సహకారాలు ఎల్లపుడూ ఉంటాయని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.