
యాదాద్రి పవర్ ప్లాంట్ కార్యాలయాలపై విజిలెన్స్ అధికారులు విచారణ కీలక పత్రాలు స్వాధీనం… మిర్యాలగూడ దామరచర్ల ప్రజాలహరి…. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మింప తలపెట్టిన యాదాద్రి పవర్ ప్లాంట్ పై విజిలెన్స్ అధికారులు విచారించినట్లు తెలుస్తుంది .యాదాద్రి పవర్ ప్లాంట్ అధికారుల కార్యాలయాలపై విజిలెన్స్ అధికారులు విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది .పవర్ ప్లాంట్ నిర్మాణానికి సంబంధించిన వివరాలు ఇతర వ్యాయాయాలపై రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు కూడా తెలుస్తుంది . పవర్ ప్లాంట్ నిర్మాణం పై న్యాయ విచారణ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించిన విషయం విధితమే. అధికారులు సూచనల మేరకు విజిలెన్స్ అధికారులు గత రెండు రోజులు బట్టి విచారిస్తున్నట్లు తెలియ వచ్చింది.అయితే ఈ విషయాన్ని బయటికి రానేకుండా జాగ్రత్త పడుతున్నట్లు రైతులకు చెల్లించిన నష్టపరిహారం వివరాలు పూర్తిస్థాయిలో లేకపోవడంపై కూడా అనుమానాలు వస్తున్నాయి. అంచన లు 28,000 కోట్లుగా నిర్మాణంలో జాప్యం కారణంగా 55 వేల కోట్లు పోయినట్లు తెలుస్తుంది ప్రస్తుతం పనులు 50% మాత్రమే పూర్తయ్యాయి.