
*ప్రజా పాలన కు ఇంకా రెండురోజులే*
(మిర్యాలగూడ ప్రజాలహరి. )మిర్యాలగూడ RDO కార్యాలయం నందు జనవరి 5 మరియు 6వ తేదీల్లో నిర్వహించబోయే ప్రజా పాలన కార్యక్రమం పై అధికారులతో రివ్యూ సమావేశంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి – .. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ చివరి రెండు రోజుల ప్రజా పాలన కార్యక్రమం చాలా కీలకం.. కౌంటర్స్ సంఖ్య పెంచైనా సరే ప్రతిఒక్కరి దగ్గర అప్లికేషన్ ఫార్మ్స్ తీసుకునేలా అధికారులు అంతా బాధ్యత తీసుకోవాలని అన్నారు … అలాగే దరఖాస్తు ఫార్మ్స్ అందక చాలా మంది జిరాక్స్ లు తీసుకుంటున్నారు కావున ప్రతిఒక్కరికి ఫార్మ్స్ అందజేయాలని అన్నారు.. *జనవరి 06 వ తేదీ వరకు* మాత్రమే దరఖాస్తులు స్వీకరిస్తాము అనే విషయాన్ని ప్రతిఒక్కరికీ తెలియజేయాలి అని అన్నారు.