Ultimate magazine theme for WordPress.

ప్రజా ప్రతినిధులు ఐక్యంగా అభివృద్ధి కి కృషి చేయాలి. మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి

Post top
home side top

ప్రజలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి

మిర్యాలగూడశాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి

వేములపల్లి (ప్రజాలహరి) మండల పరిషత్ కార్యాలయంలో ప్రతి మూడు మాసాలకు ఒకసారి జరిగే సమావేశానికి శనివారం స్థానిక ఎంపీపీ పుట్టల సునీత అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజలు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో కలిసి, మెలసి ప్రజలకు కావలసినటువంటి పనులన్నీ పూర్తి చేసినప్పుడే మండలం అభివృద్ధి చెందుతారని ఆయన అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. అంతేకాకుండా మండలంలో ఉన్నటువంటి ప్రతి గ్రామంలో పెండింగ్ పనులు ఏమైనా ఉన్నట్లయితే తక్షణమే పూర్తి చేయాలని ఆయన అన్నారు. అందుకు నా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి వారికి అందే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు .అనంతరం మండలంలో ఉన్నటువంటి సర్పంచుల పదవీకాలం దగ్గర పడుతుండడంతో వారికి స్థానిక ఎంపీపీ సునీత, జెడ్పిటిసి మంగమ్మ ఆధ్వర్యంలో సర్పంచ్లకు శాలువాలతో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్ ఎంపీపీ గోవర్ధన, ఎంపీడీవో జానయ్య, ఎమ్మార్వో పలువురు ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.