
మిర్యాలగూడ ప్రజాలహరి.
మిర్యాలగూడ మండలంలోని టీక్యా తండా గ్రామానికి చెందిన ధీరావత్ మీరి (65) గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం రాత్రి మృతి చెందారు. స్థానిక సర్పంచ్ దిరావత్ మేరీ ధీరావత్ మంగ్యా నాయక్ ద్వారా మీరి మృతి చెందిన విషయాన్ని బీఆర్ఎస్ యువనేత, ఎన్బీఆర్ ఫౌండేషన్ చైర్మన్ నల్లమోతు సిద్దార్థ తెలుసుకున్నారు. టీఎస్ ఆగ్రోస్ మాజీ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డితో కలిసి ధీరావత్ మీరి పార్థివదేహాన్ని నల్లమోతు సిద్దార్థ సందర్శించారు. మీరి భౌతిక కాయానికి శ్రద్ధాంజలి ఘటించి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సిద్దార్థ వెంట ఏఎంసీ మాజీ చైర్మన్ ధనావత్ చిట్టిబాబు నాయక్ ,సింగిల్ విండో డైరెక్టర్ సుధాకర్, తదితరులు ఉన్నారు