
పోచంపల్లి దిమ్ పార్కులో పోచంపల్లి చీరలు సందర్శించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము…. ప్రజాలహరి హైదరాబాద్ …. భారత రాష్ట్రపతి ద్రౌపది మురము బుధవారం తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా పోచంపల్లి దిమ్ పార్క్ సందర్శించారు. ఇక్కడ చేనేత వస్త్రాలు తయారీకి ప్రసిద్ధి ఈ ప్రాంతాల్లో తయారుచేసి చేనేత వస్త్రాలను సందర్శించారు. చీరల తయారీలో భూదాం పోచపల్లి ప్రపంచ ప్రఖ్యాతిగా పొందినదని పేర్కొన్నారు. ముందుగా మంగళవారం సాయంత్రం భారత రాష్ట్రపతి హైదరాబాద్ చేరుకున్నారు. అక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఇతర మంత్రులు స్వాగతం పలికారు. ఈరోజు ఉదయం 10:30 కు పోచంపల్లి కి ప్రత్యేక విమానాల్లో చేరుకున్నారు. అక్కడ తెలంగాణ రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరావు ,సీతక్క ఎమ్మెల్యేలు ఆయిలయ్య తదితరులు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో కేంద్ర జౌళి శాఖ మంత్రులు సాహూ, జయ రంజన్ పాల్గొన్నారు.