
మిర్యాలగూడ ప్రజాలహరి….. ఆర్డీవో ఆఫీస్ లో మంగళవారం మిర్యాలగూడలో ప్రభుత్వం ద్వారా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి గ్రాండ్ సెమి క్రిస్మస్ సెలబ్రేషన్స్ సందర్భంగా ఈరోజు మిర్యాలగూడ నియోజకవర్గం పాస్టర్స్ అందరితో శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి ఆర్డీవో కార్యాలయం లో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరం ఏ రీతిగానితే నిర్వహించారు అదే రీతిగా 22 వ తారీఖున సెమి క్రిస్మస్ నిర్వహించి విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు శంకర్ నాయక్, ఎమ్మార్వో , పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, గాయం ఉపేందర్ రెడ్డి, మరియు అధికారులు పాస్టర్స్ ఫెలోషిప్ అధ్యక్షులు మరియు సభ్యులు పాల్గొన్నారు.*