Ultimate magazine theme for WordPress.

ప్రజా తీర్పును గౌరవిస్తాం…. రంగారెడ్డి

Post top
home side top

ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం…

* ఆధైర్య పడకుండా ప్రజా ఉద్యమాలు నడపాలి

*ముఖ్యకార్యకర్తల సమావేశంలో జూలకంటి

 

మిర్యాలగూడ

 

ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని ప్రజలకు దగ్గర అయ్యేవిధంగా భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నడపాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. బుధవారం సిపిఎం కార్యాలయంలో నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తున్నామని తెలిపారు ఎన్నికల్లో చివరి వరకు కాంగ్రెస్తో పొత్తు ఉంటుందని భావించామని పార్టీ కార్యకర్తల్లో కూడా పొత్తు ఉంటుందని భావించారని కానీ చివరి క్షణంలో ఒంటరిగా పోటీ చేయాల్సి వచ్చింద అన్నారు. పార్టీ నిర్ణయాన్ని కట్టుబడి ప్రజాక్షేత్రంలో పోటీ చేశామని ప్రజలు తమను నమ్మలేదని చెప్పారు. ప్రభుత్వంపై స్థానిక ఎమ్మెల్యే పై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం వల్ల అతనిపై సానుకూలత నెలకొందని ఆ కోణంలోనే ఆ పార్టీ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించారని చెప్పారు. ఓటింగ్ క్రాస్ అయితే బీఆర్ఎస్ అభ్యర్థి ఎక్కడ గెలుస్తారనే అప నమ్మకంతో ప్రజలు పెద్ద ఎత్తున కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించారని చెప్పారు. ప్రజా సమస్యలపై భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలు నడుపుతామని చెప్పారు కొత్తగా ఏర్పడుతున్న ప్రభుత్వం కు, స్థానిక ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల హామీలను వెంటనే అమలు పరచాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పని చేయాలని సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తల సిద్ధం కావాలని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, జిల్లా నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, భవాండ్ల పాండు,రాగిరెడ్డి మంగా రెడ్డి వినోద్ నాయక్, వరలక్ష్మి, రొంది శ్రీనివాస్, తిరుపతి రామ్మూర్తి, పగిదోజు రామ్మూర్తి, సైదులు, వీరాచారి తదితరులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.