
మిర్యాలగూడ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లక్ష్మారెడ్డికి మాతృవియోగం……మిర్యాలగూడ ప్రజాలహరి.
.నల్గొండ జిల్లామిర్యాలగూడ అసెంబ్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల లక్ష్మారెడ్డి మాతృమూర్తి శ్రీమతి వెంకట రావమ్మ (77 )ఆదివారం రాత్రి మృతి చెందారు. ఆమె గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నది. ఆమెకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. నిన్న సాయంత్రం ఐదున్నర నుంచి ఏడు గంటల లోపు సమయంలో పరిస్థితులు విషమించడంతో మృతి చెందింది. లక్ష్మారెడ్డి రవీందర్ నగర్ పార్టీ కార్యక్రమంలో ఉన్నారు. ఈ విషయం తెలియడంతో వెంటనే ప్రచార కార్యక్రమాలను రద్దు చేసుకుని ఇంటికి చేరుకొని ఆమె మృతదేహం పై పడి బోరున విలపించారు.తల్లిని కాపాడుకోవాలని పలు ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. ఆయన ను కార్యకర్తలు, బంధువులు స్నేహితులు, నాయకులు ఓదార్చారు. సోమవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.